CNG Price: మళ్లీ పెరిగిన సీఎన్జీ ధర.. రెండు నెలల్లో 13వ సారి!
సీఎన్జీ ధర మరింత పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో శనివారం కిలోకు సీఎన్జీ ధర రూ.2లు మేర పెరిగింది.....
దిల్లీ: సీఎన్జీ ధర మరింత పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో శనివారం కిలోకు సీఎన్జీ ధర రూ.2లు మేర పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలోనే సీఎన్జీ ధరలు పెంచడం ఇది 13వ సారి కావడం గమనార్హం. దిల్లీ, చుట్టుపక్కల నగరాలకు సీఎన్జీ, గొట్టపు వంట గ్యాస్ను విక్రయించే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ప్రాంతంలో దీని ధర కేజీ రూ.75.61కి పెరిగింది. మార్చి 7 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 13 సార్లు పెంచగా.. కిలో సీఎన్జీపై మొత్తంగా రూ.19.60లు పెరిగింది. గత ఏడాది కాలంగా పరిశీలిస్తే కిలో సీఎన్జీపై దాదాపు రూ.32.21 లేదా 60శాతం పెరిగినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు