YouTube: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు నీల్ మోహన్ నియామకం
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు. సూసన్ వొజిసికి తన పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్(YouTube)కు భారతీయుడు నీల్ మోహన్(Neal Mohan) సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్ యాజమాన్యం ఇండియన్-అమెరికన్ అయిన నీల్ మోహన్ను కొత్త సీఈవోగా నియమించింది. ప్రస్తుతం నీల్ మోహన్ యూట్యూబ్లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్(Sundar Pichai), మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల(Satya Nadella), అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్(Shantanu Narayen) ఉన్నారు. ఇక నీల్ మోహన్ మరోసారి భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. మరో భారతీయుడు పరాగ్ అగర్వాల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్కు సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్మోహన్కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సేవలను కొనియాడారు. సూసన్ అసాధారణ టీమ్ను సిద్ధం చేశారని పేర్కొన్నారు. యూట్యూబ్ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాలని తన ప్రకటనలో సుందర్ పిచాయ్ తెలిపారు. నీల్ మోహన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్. 2008లో గూగుల్లో చేరారు.
కుటుంబ, ఆరోగ్యం, ఇతర ప్రాజెక్ట్లపై దృష్టి కోసమే..
సీఈవో పదవి నుంచి వైదొలిగిన సూసన్ వొజిసికికి కంపెనీతో ఎంతో అనుబంధం ఉంది. ఇక యూట్యూబ్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్లో గత 25ఏళ్లుగా పలు పదవుల్లో కొనసాగారు. యూట్యూబ్కు గత తొమ్మిది ఏళ్లుగా సీఈవోగా ఉన్నారు. తన పదవి నుంచి వైదొలుగుతున్న క్రమంలో సూసన్ కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్లపై దృష్టి నిలిపేందుకు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కొత్త జీవితం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ ఆమె సేవలను కొనియాడారు. గూగుల్ చరిత్రలో సూసన్కు ఒక ప్రత్యేక స్థానమున్నట్లు పేర్కొన్నారు. ప్రతిచోటా ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులకు ఆమె అత్యంత అద్భుత సహకారం అందించినట్లు తెలిపారు. సూసన్ సీఈవోగా ఉన్న సమయంలో యూట్యూబ్ ఎంతో స్థాయికి చేరుకుంది. ఎన్నో లాభాలను కంపెనీకి అందించారు. గతేడాది యూట్యూబ్ ప్రకటనల ఆధారంగా 29.2 బిలియన్ డాలర్లను సంపాదించింది. ఇది మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువే. ఇక కొత్త సీఈవో నీల్ మోహన్తో సూసన్కు ఎంతో స్నేహపూర్వక అనుబంధం ఉంది. తొలుత వీరిద్దరు గూగుల్ ప్రకటనల విభాగంలో కలిసి పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!