హాథ్రస్ ఘటనలో మరో ట్విస్ట్!
దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్లో యువతి హత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులుగా పేర్కొంటూ బాధితురాలి కుటుంబ .........
బాధితురాలి కుటుంబంపై నిందితుల తీవ్ర ఆరోపణలు
నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న బాధితురాలి తండ్రి
హాథ్రస్: దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్లో యువతి హత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులుగా పేర్కొంటూ బాధితురాలి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు హాథ్రస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్కు వారు లేఖ రాసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. యువతిపై హత్యాచారం ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యువతితో తమకు స్నేహం ఉండేదని, బాధితురాలితో తరచూ తాము మాట్లాడుతుండేవాళ్లమని నిందితులు లేఖలో పేర్కొన్నారు. తమ స్నేహం కుటుంబ సభ్యులకు నచ్చేది కాదని పేర్కొన్నారు. బాలికను కొట్టిన చోట తాము లేమని లేఖలో తెలిపారు. ఆ ఘటన జరిగిన రోజు తాను అక్కడే ఉన్నానని, బాధితురాలి తల్లి, సోదరుడు అక్కడికి వచ్చి అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు ప్రధాన నిందితుడు తెలిపాడు. తనతో స్నేహం వల్లే యువతిని తీవ్రంగా కొట్టారని లేఖలో ఆరోపించాడు. బాధితురాలి కుటుంబం తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖలో చివరన నలుగురు నిందితులు తమ వేలిముద్రలు వేశారు.
ధ్రువీకరించిన జైలు అధికారి
మరోవైపు, బాధితురాలి సోదరుడు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్ ఠాకూర్తో ఫోన్లో మాట్లాడాడని, గతేడాది అక్టోబర్ నుంచి మార్చి వరకు దాదాపు 104 ఫోన్ కాల్స్ చేసినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. అయితే, నిందితులు హథ్రాస్ ఎస్పీకి లేఖ రాసినట్టు అలీగఢ్ జైలు సీనియర్ సూపరింటెండెంట్ అలోక్ సింగ్ ధ్రువీకరించారు. బుధవారం సాయంత్రమే లేఖరాశారని, చట్టప్రకారం తాము ఆ లేఖను ఎస్పీకి పంపినట్టు తెలిపారు.
మాపై నిందలు వేసేందుకే..: బాధితురాలి తండ్రి
అయితే, నిందితుల ఆరోపణలపై బాధితురాలి తండ్రి స్పందించారు. తన కుమార్తెను కోల్పోయామని, ఇప్పుడు నిందితులు తమపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్ల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. తమకు ఎలాంటి పరిహారం అక్కర్లేదని.. న్యాయం కావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...