వాడటం రాదు, మీరే తీసుకోండి..
ఫోన్ను వాడటం తనకు చేతకావటం లేదని.. తిరిగిచ్చేస్తానని అతను చెప్పటంతో ఆశ్చర్యపోవటం యజమాని వంతయ్యింది.
ఫోన్ తిరిగిచ్చిన దొంగ
బుర్ద్వాన్: తన ఫోన్ను ఓ దుకాణంలో పోగొట్టుకున్న వ్యక్తికి.. దానిని దొంగిలించిన వ్యక్తే తిరిగి ఇచ్చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. అయితే తిరిగివ్వడానికి కారణం తనకు ఆ ఫోన్ను వాడటం రాకపోవటమే అని ఆ దొంగ పేర్కొనటం విచిత్రం. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు బుద్వాన్ జిల్లా, జమాల్పూర్కు చెందిన ఓ వ్యక్తి రూ. 45,000 విలువ చేసే తన ఫోన్ను ఓ మిఠాయి దుకాణంలో పోగొట్టుకున్నాడు. వెంటనే తన నంబరుకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అయినట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
అయితే ఫోన్ యజమాని ఆశ కోల్పోకుండా మరల మరల కాల్ చేసేందుకు ప్రయత్నించాడు. కాగా, కొన్ని రోజుల అనంతరం దానిని దొంగిలించిన వ్యక్తి జవాబిచ్చాడు. అంతే కాకుండా ఆ ఫోన్ను వాడటం తనకు చేతకావటం లేదని.. తిరిగిచ్చేస్తానని అతను చెప్పటంతో ఆశ్చర్యపోవటం యజమాని వంతయ్యింది. అనంతరం దొంగిలించిన వ్యక్తి ఇంటి నుంచే పోలీసుల సహకారంతో తన ఫోనును తిరిగి తీసుకున్నాడు. దొంగిలించిన వ్యక్తి పశ్చాత్తాపం ప్రకటించటంతో.. ఫోన్ యజమాని విజ్ఞప్తి మేరకు పోలీసులు అతనిపై ఏ చర్య తీసుకోకపోవటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. -
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM