Amit Shah: అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నకిలీ వీడియోల కేసులో కాంగ్రెస్ నేత పీఏ, ఆమ్ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు.
అహ్మదాబాద్: రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు (Fake Video) సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై గుజరాత్ (Gujarat) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే అమిత్ షా నకిలీ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేత అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం.. బనస్కంతాకు చెందిన సతీశ్ వన్సోలా, దాహోద్ జిల్లాకు చెందిన రాకేశ్ బరియాను మంగళవారం అరెస్టు చేసింది. వీరిలో సతీశ్.. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక, రాకేశ్ గత నాలుగేళ్లుగా ఆమ్ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
‘‘ఈ ఎడిటెడ్ వీడియో వీరిద్దరికీ వాట్సప్లో వచ్చింది. దాన్ని వారు ఉద్దేశపూర్వకంగానే ఫేస్బుక్ పేజీల్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఎవరు ఎడిట్ చేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నాం. త్వరలోనే అతడిని పట్టుకుంటాం’ అని సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. కాగా.. ఈ అరెస్టుపై ఎమ్మెల్యే మేవానీ స్పందించారు. ‘‘భాజపా ఐటీ విభాగం చాలాకాలంగా నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తోంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను అరెస్టు చేస్తున్నారు. సతీశ్ పొరబాటుగానే ఆ వీడియోను షేర్ చేశాడు’’ అని తెలిపారు.
అమిత్ షా ఈనెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేసిన నకిలీ వీడియోను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు రాష్ట్రాల్లోనూ దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.