Nellore: క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ.. బాలుడి మృతి

క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. 

Published : 24 Dec 2023 17:41 IST

నెల్లూరు: క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. నెల్లూరు (Nellore News)లోని జాకీర్‌ హుస్సేన్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫరీద్‌ (14)ను మరో బాలుడు గొంతు, గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు