ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది.
తపాలాశాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. తనకంటే జూనియర్లుగా ఉన్న సురేంద్రకుమార్, బీటీసింగ్ల నుంచి తపాలాశాఖ హైదరాబాద్ డివిజన్.. సార్టింగ్ విభాగంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మాధవి లంచం తీసుకొని పదోన్నతులిచ్చారని ఎండీ ఖలీముద్దీన్ అనే తాత్కాలిక ఉద్యోగి 2023 జనవరి 7న ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తాను రూ.1.5 లక్షలు లంచం ఇచ్చి శాశ్వత నియామక ఉత్తర్వులు తెచ్చుకున్నానని బీటీసింగ్ విచారణాధికారుల వద్ద అంగీకరించారు. దీనికి సంబంధించి సురేంద్ర తనకు, మాధవికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో రికార్డింగ్ను ఉన్నతాధికారులకు అందించారు. మొత్తం 18 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి మాధవి రూ.18 లక్షలు అడుగుతున్నట్లు ఆడియోలో స్పష్టంగా ఉంది. ఇంకో ఆడియోలో మరో 16 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి రూ.20 లక్షలు అడిగినట్లు కూడా ఉంది. దీనిపై విచారణ మొదలయ్యాక మాధవి తనను బెదిరించారని, తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్నారని పేర్కొన్నారు. తాను డబ్బు తిరిగి ఇస్తానని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారని కూడా సురేంద్రకుమార్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీని ఆడియో క్లిప్నూ అందించారు. తన ఉద్యోగానికి రూ.2 లక్షలు, బీటీసింగ్ కోసం 1.50 లక్షలు మాధవికి ఇచ్చామన్నారు. విచారణ మొదలుకావడంతో మాధవి, శ్రవణ్కుమార్ అనే మరో ఉద్యోగి.. తమను పిలిచి, రూ.2.4 లక్షలు తిరిగిచ్చేశారని, ఈ మొత్తం ప్రక్రియలో లంచాల ప్రస్తావన రాలేదని వాంగ్మూలం ఇవ్వాలని తనను బలవంతం చేశారంటూ సురేంద్రకుమార్ తెలిపారు. దీనిపై తపాలాశాఖ ఉన్నతాధికారులు రాసిన లేఖ ఆధారంగా హైదరాబాద్ సీబీఐ విభాగం ఈ నెల 8న సీహెచ్ మాధవి, సురేంద్రకుమార్, బీటీసింగ్లపై కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
తాజాగా వైరలైన తమ చిన్నారికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల విమర్శలను తట్టుకోలేని ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. -
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక