Anantapur: ఇంజినీరింగ్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ దారుణ హత్య

అనంతపురం జేఎన్టీయూ సమీపంలో నివాసం ఉండే ఓ ఇంజినీరింగ్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ దారుణ హత్యకు గురయ్యారు.

Updated : 11 Mar 2024 13:09 IST

అనంతపురం క్రైమ్‌: అనంతపురం జేఎన్టీయూ సమీపంలో నివాసం ఉండే ఓ ఇంజినీరింగ్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూర్తిరావు గోఖలే (59) గతంలో అనంతపురం నగర శివారులోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పని చేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్‌కేయూ)లో పని చేస్తున్నారు. జేఎన్‌టీయూ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఖోకలే మేనల్లుడు ఆయనపై దాడి చేసి బ్లేడుతో గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి తగాదాలు, ఖోకలే కుమార్తె పెళ్లి విషయం నచ్చక హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని