Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. తమిళనాడులోని వైద్యుల సాయంతో ఈ ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు: మాతృత్వపు అనుభూతి వర్ణించలేనిది. ‘అమ్మ’ అనే పిలుపు కోసం ఎంతో మంది స్త్రీలు ఆరాటపడుతుంటారు. కానీ, కొందరు తల్లులు మాత్రం అమ్మతనానికి మచ్చ తెచ్చేలా తమ పిల్లల్ని విక్రయిస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో అమ్ముకున్న వారు కొందరైతే.. కన్నబిడ్డలను పోషించే స్థోమత లేక అమ్మకానికి పెట్టిన దయనీయ పరిస్థితి కొందరిది. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకొని చిన్నారుల విక్రయాలు కొనసాగిస్తున్న ముఠా గుట్టును (Child Selling Racket) బెంగళూరు పోలీసులు (Bengaluru Police) రట్టు చేశారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి.. నెలల పిల్లల వరకు వీళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తేల్చారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు 10 మంది చిన్నారుల్ని ఈ ముఠా వివిధ చోట్ల విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివరాలను ఛైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ దయానంద్ మీడియాకు వెల్లడించారు.
ఈ ముఠాతో తమిళనాడులోని 4 ప్రముఖ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు కూడా సంబంధముందని దయానంద్ తెలిపారు. ఒక్కో చిన్నారిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాత్రి 20 రోజుల మగ శిశువును విక్రయ ముఠా నుంచి పోలీసులు రక్షించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సిటీ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముగ్గురు మహిళలు ఓ చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు.
దీంతో వాళ్లని కస్టడీలోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఇతరులకు అనుమానం రాకుండా నిందితులు చిన్నారులను కార్లలోనే రవాణా చేస్తున్నారని దయానంద్ తెలిపారు. తమిళనాడులోని 4 ఆస్పత్రులు, డాక్టర్లు, బెంగళూరులోని ఓ మహిళ కలిసి ఈ ముఠాను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు మహిళలతో సహా నలుగురు నిందితులను ఆర్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కన్నన్ రామస్వామి, మురుగేశ్వరి, హేమలత, శరణ్యగా గుర్తించారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపైనా ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
లోన్ యాప్లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక వినీత్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!