ప్రభుత్వ హాస్టల్లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!
College Student Murder: ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న ఓ కాలేజీ విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడు కొన్ని గంటల వ్యవధిలోనే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు.
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని దక్షిణ ముంబయి (Mumbai)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ వసతి గృహంలో 18 ఏళ్ల విద్యార్థిని హత్యాచారానికి (Rape and Murder) గురైంది. కాగా.. ఈ ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న హాస్టల్ సెక్యూరిటీ గార్డు.. రైలు పట్టాలపై శవమై కన్పించడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం..
అకోలా ప్రాంతానికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి ముంబయి శివారులోని బాంద్రాలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు పూర్తవడంతో ఇటీవలే ఇంటి నుంచి ప్రభుత్వ వసతి గృహానికి తిరిగొచ్చింది. అయితే, మంగళవారం ఉదయం ఆమె కన్పించకుండా పోయింది. ఆమె ఉంటున్న హాస్టల్ గది బయటి నుంచి తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ అధికారులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆమె బయటికెళ్లినట్లు అందులో లేదు. మెయిన్గేట్ వద్ద ఉన్న బుక్లోని ఆమె సంతకం కూడా లేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది ఆమె గది కిటికీని బద్దలుకొట్టి చూడగా.. లోపల ఆ యువతి నగ్నంగా పడిఉంది.
దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతిపై తొలుత అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంగళవారం తెల్లవారుజామునే యువతి హత్యకు గురైనట్లు తేల్చారు. హాస్టల్ సెక్యూరిటీ గార్డు ప్రకాశ్ కనోజియానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఘటన జరిగిన తర్వాత కొద్దిసేపటికి అతడు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, మంగళవారం సాయంత్రం సమీపంలోని రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతిపై హత్యచారం చేసి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM