పాటలు వింటూ చిరుతకు బలి..!
ఉత్తరాఖండ్కు చెందిన ఓ బాలిక హెడ్ఫోన్ల ద్వారా పాటలు వింటూ చిరుతపులికి బలయింది.
రుద్రపూర్: హెడ్ఫోన్స్లో పాటలు వింటూ ఓ బాలిక చిరుతపులి బారినపడింది. ఈ దుర్ఘటన ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో చోటుచేసుకుంది. బైల్పారో అటవీ ప్రాంత సమీపంలో చౌనాఖాన్ గ్రామానికి చెందిన మమత అనే బాలిక 8వ తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం తమ ఇంటి వద్ద ఉన్న ఓ కాలువ ఒడ్డున కూర్చుని హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటోంది. ఈలోగా బాలికపై ఓ చిరుతపులి హఠాత్తుగా దాడిచేసి అడవిలోకి లాక్కెళ్లింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ హెడ్ఫోన్, దువ్వెన లభించినట్టు వారు తెలిపారు. అనంతరం ఆడవిలోని పొదల్లో బాలిక మృతదేహం లభించినట్టు అధికారులు వివరించారు. బాలిక పాటలు వింటూ ఉండటంతో.. పులి వచ్చినట్టు గుర్తించలేదని వారు అంటున్నారు.
ఈ సంఘటనతో కుమౌన్ ప్రాంతంలో చిరుత దాడిలో మరణించిన వారి సంఖ్య ఒక్క నెలలో ఎనిమిదికి చేరింది. బాలికను చంపిన ఆ చిరుతను బంధించటానికి అటవీశాఖ సిబ్బంది రెండు బోన్లు, ఏడు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ చిరుత బాలికను చంపిన చోటికి మళ్లీ వచ్చి కెమెరా కంటికి చిక్కింది. అయితే, అది అక్కడే ఉన్న బోను సమీపానికి వచ్చినప్పటికీ... గ్రామస్థుల అలికిడి విని అక్కడి నుంచి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోనులు ఉంచిన ప్రదేశాలను మళ్లీ మారుస్తామని వారు వెల్లడించారు. పోస్ట్మార్టమ్ అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వారికి రాష్ట్రప్రభుత్వం తరపున రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు