పెందుర్తిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Updated : 04 Apr 2024 10:21 IST

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. 

ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందిన వారంతా వ్యాన్‌లో శ్రీకాకుళం జిల్లా పొందూరులో వివాహానికి వెళ్లారు. వ్యాన్‌లో తిరిగి వస్తుండగా అక్కిరెడ్డిపాలెం హైవేపై లారీ ఢీకొట్టింది. మృతుల్లో చింతాడ ఇందు (50), హనుమంతు ఆనంద్‌ (40), హనుమంతు చంద్రశేఖర్‌ (16) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు