నిండు ప్రాణాన్ని బలిగొన్న రహదారి గొయ్యి

రహదారిపై ఉన్న గొయ్యి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అనకాపల్లి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన మిర్తిపాటి నాగమణి(45)

Published : 28 Sep 2022 04:30 IST

కె.కోటపాడు, న్యూస్‌టుడే: రహదారిపై ఉన్న గొయ్యి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అనకాపల్లి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన మిర్తిపాటి నాగమణి(45) సోమవారం తన కుమారుడు శివతో కలిసి విశాఖలోని బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం బైక్‌పై వెళ్లారు. కార్యక్రమం ముగిశాక ఇద్దరూ తిరుగు పయనమై... సబ్బవరం మండలం మొగలిపురం సమీపానికి వచ్చారు. అక్కడ తారురోడ్డుపై ఉన్న గొయ్యిలోకి దిగి బైకు అదుపు తప్పింది. వెనుక కూర్చున్న నాగమణి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. నాగమణి గ్రామంలో అల్పాహార దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. దానిపై వచ్చే సంపాదనతో కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆమె మృతితో కుటుంబసభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని