ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి 26 మంది మృతి
ఆలయంలో వేడుకకు హాజరై తిరిగి వస్తున్న గ్రామస్థులు పెను ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో బోల్తాపడడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ నగర సమీప భదానా గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాన్పుర్ సమీపంలో ఘోర ప్రమాదం
కాన్పుర్: ఆలయంలో వేడుకకు హాజరై తిరిగి వస్తున్న గ్రామస్థులు పెను ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో బోల్తాపడడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ నగర సమీప భదానా గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాలీలో 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఫతేపుర్లోని చంద్రికాదేవి ఆలయంలో చిన్నారికి నిర్వహించిన పుట్టెంట్రుకల కార్యక్రమానికి హాజరైన బంధు మిత్రులు ఘటంపుర్లోని ఇళ్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు