Viral video: ట్రాక్టర్తో స్టంట్మ్యాన్ విన్యాసాలు ప్రదర్శిస్తుండగా..!
ట్రాక్టర్తో విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓ స్టంట్మ్యాన్ మృతిచెందాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Image: Arvindkumar065
చండీగఢ్: పంజాబ్లోని (Punjab) గురుదాస్పుర్ జిల్లాలో నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్తో విన్యాసాలు ప్రదర్శిస్తున్న ఓ స్టంట్మ్యాన్ ఆ వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. తాతే గ్రామానికి చెందిన సుఖ్మన్దీప్ సింగ్ (29) ట్రాక్టర్తో స్టంట్స్ చేయడంలో దిట్ట. గతంలో పలు టీవీ ఛానళ్లలో అతను చేసిన స్టంట్స్ ప్రసారమయ్యాయి. సుఖ్మన్దీప్ భార్య పంజాబ్ పోలీసు శాఖలో పనిచేస్తోంది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.
కన్నతల్లిపై ఓ న్యాయవాది కర్కశత్వం
ఫతేగఢ్ ఛురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటంతో సుఖ్మన్ అక్కడికి వెళ్లాడు. నిర్వాహకులు సిద్ధం చేసిన మైదానంలో తన ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. ఆ వాహనం గింగిరాలు తిరుగుతుండగానే సుఖ్మన్ టైరు మీద కాలుపెట్టి డ్రైవరు సీట్లోకి వెళ్లే సాహసం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అతడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ పలుమార్లు స్టంట్మ్యాన్పై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తదుపరి క్రీడా ఉత్సవాలు రద్దయ్యాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని, విచారణ చేపడుతున్నామని గురుదాస్పుర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని చెప్పారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించే వారికి మాత్రమే తాము అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
లోన్ యాప్లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక వినీత్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట