Medak: గంట వ్యవధిలో.. గుండెపోటుతో తల్లీకుమారుడి మృతి

మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందారు.

Updated : 06 Jan 2024 16:39 IST

హవేలిఘన్‌పూర్: మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందారు. శనివారం ఉదయం నర్సింహగౌడ్‌ (36) మృతి చెందగా.. అది తట్టుకోలేక తల్లి లక్ష్మి (57) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహగౌడ్‌ కారు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న అతని తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె కూడా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సింహగౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని