రూ.1.50కోట్ల విలువైన గంజాయి పట్టివేత
అల్లం బస్తాల మధ్యలో గంజాయి మూటలను తరలిస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే
విజయనగరం రింగ్రోడ్డు : అల్లం బస్తాల మధ్యలో గంజాయి మూటలను తరలిస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గజపతినగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని ఈ ఉదయం వై జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో 3వేల కేజీల గంజాయి వెలుగు చూసింది. వ్యాన్ డ్రైవర్ సత్యభాన్సింగ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. సిమిలిగూడ నుంచి ఉత్తరప్రదేశ్కు గంజాయి తరలిస్తున్నట్టు అంగీకరించాడు. దిల్లీ నుంచి కుర్చీలు సిమిలిగూడ తీసుకొచ్చానని, తిరుగు ప్రయాణంలో యజమాని వితన్ కుమార్ సూచనల మేరకు గంజాయి బస్తాలను తరలిస్తున్నట్టు చెప్పాడు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఆగ్రాకు చెందిన అరవింద్కుమార్, కొరాపుట్కు చెందిన భరత్కుమార్ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. గంజాయి లోడుతో వెళ్తున్న వాహనం వెనుకనే వీరిద్దరూ మరో గస్తీ వాహనంలో వెళుతున్నట్లు ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.