గుంతల రోడ్డు.. ప్రాణం తీసింది!

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డుపై గుంతలు వాహనదారుల ప్రాణాలు బలిగొంటున్నాయి. టెక్కే వద్ద ఉన్న ఓ గుంత..

Updated : 29 Nov 2023 11:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డుపై గుంతలు వాహనదారుల ప్రాణాలు బలిగొంటున్నాయి. టెక్కే వద్ద ఉన్న ఓ గుంత వల్ల ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వాహనదారులు సైతం కిందపడిపోయారు. అయితే వెనకాలే వస్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడిని శ్రీహర్షగా గుర్తించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని