Hyd News: కానిస్టేబుల్‌ మృతి.. మిస్‌ఫైరా.. ఆత్మహత్యా..?

పాతబస్తీ హుస్సేనీఆలం పరిధి కబూతర్‌ఖానా వద్ద  కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Published : 07 Apr 2024 10:24 IST

హైదరాబాద్‌: పాతబస్తీ హుస్సేనీఆలం పరిధి కబూతర్‌ఖానా వద్ద  ఓ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రౌండ్లు ఫైర్‌ జరిగినట్లు వెల్లడించారు. మృతుడిని 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యిందా లేదా ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని