రిఫ్రిజిరేటర్‌ పేలి ఆరుగురి మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Refrigerator compressor explodes in Punjab: రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్‌ పేలిన ఘటనలో ఆరుగురు మరణించారు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 09 Oct 2023 19:33 IST

చండీగడ్‌: పంజాబ్‌లోని (Punjab) జలంధర్‌ జిల్లాలో ఊహించని ప్రమాదం జరిగింది. రిఫ్రిజిరేటర్‌ (Refrigerator) కంప్రెషర్‌ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో అభంశుభం తెలీని ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం కలచివేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది పార్టీ ఖాతానా.. సీఎంఓ ఖాతానా?.. ఏపీ సీఎం కార్యాలయంపై నెటిజన్ల ఫైర్‌!

ఇంటిల్లిపాది ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అనంతరం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశ్‌పాల్‌ గాయ్‌ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్‌ (41), కోడలు రుచి గాయ్‌ (40) వారి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్‌ మృత్యువాతపడ్డారు. ఘటనా స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్‌ను ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ఆయన  మరణించారు. పేలుడుకు గల అసలు కారణం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలికి చేరుకుని శాంపిళ్లను సేకరించిందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని