CMO Andhra Pradesh: ఇది పార్టీ ఖాతానా.. సీఎంఓ ఖాతానా?.. ఏపీ సీఎం కార్యాలయంపై నెటిజన్ల ఫైర్!
ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పార్టీ ఫొటోలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది పార్టీ ఖాతానా? ప్రభుత్వ ఖాతానా? అని ఫైర్ అవుతున్నారు.
అమరావతి: సీఎం కార్యాలయం (CMO Andhra Pradesh) అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా అంటే ఎంత హుందాగా ఉండాలి? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సీఎం నిర్ణయాలు మాత్రమే ప్రతిబింబించాలి. సీఎం తీసుకునే అధికారిక నిర్ణయాలు, ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనే, పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం వరకు ఆ ఖాతా బాధ్యత. అదే ఖాతా పార్టీ రంగు పూసుకుంటే.. నెటిజన్ల నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వస్తుంది. ఏపీ సీఎంఓ అధికారిక ఎక్స్ (X) ఖాతాను ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వాడేస్తున్న తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇది సీఎంఓ ఖాతానా? పార్టీ ఖాతానా? అని నిలదీస్తున్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులూ పాల్గొన్నాయి. ‘ముఖ్యమంత్రి జగన్ ఫలానా కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు’ అని సీఎంఓ ఖాతా నుంచి ఒక వేళ పోస్టు వెలువడి ఉంటే నెటిజన్లు పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు.. పార్టీ శ్రేణులు, వారు మాట్లాడుతున్న ఫొటోలు, భోజనాలు చేస్తున్న ఫొటోలను సైతం సీఎంఓ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం ఫేస్బుక్ ఖాతాలోనూ కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయి.
ఈ పోస్టులు చూసిన వారికి ఒక క్షణం వైకాపా అధికారిక ఎక్స్ హ్యాండిలే చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతలా పార్టీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో నింపేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఏ అకౌంట్ నుంచి ఎలాంటి పోస్టులు పెట్టాలో తెలీదా? అది సీఎంఓ అకౌంట్ అనుకుంటున్నారా? పార్టీ ఖాతా అనుకుంటున్నారా?’’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఈ ఖాతాను కూడా బహుశా ఐప్యాక్ టీమే హ్యాండిల్ చేస్తోందనుకుంటా’’ అని మరో యూజర్ కామెంట్ పెట్టారు. ఓవైపు నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నా.. ఏపీ సీఎంఓ ఖాతా నుంచి ఈ పోస్టులను డిలీట్ చేయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం