Nalgonda: వోల్వో బస్సు బోల్తా.. 10 మందికి తీవ్రగాయాలు

నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది.

Updated : 25 Nov 2023 10:43 IST

చింతపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. చింతపల్లి వద్ద నాగార్జునసాగర్‌ రోడ్డుపై బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాధితులంతా శుక్రవారం వినుకొండలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు