Crime news: శామీర్‌పేటలో ఘోరం... సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు 

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట బస్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్రవాహన దారుడి అతివేగం ప్రమాదానికి కారణమయ్యాయి...

Published : 23 Aug 2021 01:24 IST

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట బస్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్రవాహన దారుడి అతివేగం ప్రమాదానికి కారణమయ్యాయి. ఓ వాహనదారుడు వెనుకవైపు చూసుకోకుండానే రోడ్డెక్కి యూటర్న్‌ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో అతివేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడికి అది గమనించే అవకాశం లేకుండా పోయింది. అదే వేగంతో ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని