Crime News: మెదక్‌ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరి మృతి

ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Updated : 27 Mar 2024 17:20 IST

పాపన్నపేట: ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్‌ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బూదెమ్మ(48), సంగమ్మ(45) మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని