logo

Road Accident: ఆదిలాబాద్‌ పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల ఢీ: ఒకరు మృతి

ఆదిలాబాద్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Published : 07 Oct 2023 01:46 IST

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పట్టణంలోని రామ్‌నగర్‌ హనుమాన్ మందిరం వద్ద పాత జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రాంనగర్‌కు చెందిన చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వినోద్ తన కుమారుడితో వెళ్తూ.. హనుమాన్ మందిరం వద్ద రోడ్డు దాటే క్రమంలో మరో ద్విచక్రవాహనంపై వస్తున్న విద్యార్థి సాయివంశీ గౌడ్‌ను వేగంగా ఢీకొన్నాడు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలవగా స్థానికులు రిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన సాయివంశీ గౌడ్ నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని