logo

Adilabad:: ఓటు వేస్తాం.. మా గ్రామానికి ఇంకో అవకాశం ఇవ్వండి!

పోలింగ్‌ కేంద్రం లేని కారణంగా దూరభారంతో ఓటింగ్‌లో పాల్గొనని తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు కోరారు.

Updated : 02 Dec 2023 08:54 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : పోలింగ్‌ కేంద్రం లేని కారణంగా దూరభారంతో ఓటింగ్‌లో పాల్గొనని తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు కోరారు. శుక్రవారం గ్రామస్థులంతా కలెక్టరేట్కు తరలివచ్చారు. పాలనాధికారి అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఇన్‌వర్డ్‌ విభాగంలో వినతిపత్రం అందజేశారు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, పోలింగ్‌ కేంద్రం దూరంగా ఉండటంతో ఓటుహక్కు వినియోగించుకోలేదని గ్రామస్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని