సామూహిక వివాహాలకు ఆదర్శం.. మహాగాం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగాం గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఆ గ్రామంలోని సంత్ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్ గురుదేవ్ సేవాశ్రమం పేద, గిరిజన కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది.
1971 నుంచి ఏటా నిర్వహణ
న్యూస్టుడే, సిర్పూర్(యు)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగాం గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఆ గ్రామంలోని సంత్ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్ గురుదేవ్ సేవాశ్రమం పేద, గిరిజన కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే ఆ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని తమ గురువు సంత్ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్ చూపించిన మార్గంలో నడుస్తూ నేటికీ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు.
ఎక్కడో మహారాష్ట్రలోని కిన్వాట్ తాలూకా సోనేగావ్ గ్రామంలో జన్మించిన సంత్ శ్రీ కోట్నక సురోజి మహారాజ్ మాహాగాం గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలను మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంచుతూ వారిలో సేవా మార్గాన్ని నింపారు. గ్రామస్థుల కోరిక మేరకు గ్రామంలో 1950లో గుట్టపై శివాలయం, 1970లో సముదాయిక్ ప్రార్థన మందిరం నిర్మించారు. పేద, మద్య తరగతి కుటుంబాల యువతీ యువకులకు 1971 నుంచి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సామూహిక వివాహాలు జరిపించడానికి బీజం వేశారు. సురోజీ మహారాజ్ కాలం చేసిన తర్వాత కూడా ఆయన కోరిక మేరకు సేవాశ్రమం సభ్యులు వివాహాలు జరిపిస్తూ వస్తున్నారు. ఏటా గ్రామంలో సంస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలలో మహాశివరాత్రి రోజున నూతన వధూవరులను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా తయారు చేస్తారు. మరుసటి రోజు సామూహిక వివాహాలను నిర్వహిస్తారని సురోజిబాబా భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 520లకుపైగా జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించగా ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 12 జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు సేవాశ్రమం సభ్యులు తెలిపారు.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సాయం
ఆరేళ్ల నుంచి ఈ సామూహిక వివాహాలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తాళిబొట్టు, మెట్టెలు, పట్టువస్త్రాలు, ఇతర సామగ్రి అందించగా, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సేవాశ్రమం ఆదరణ చూసి వీరు కూడా తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు.
సేవా మార్గమే ప్రధానం
-ఆత్రం భీంరావు, సురోజీ మహారాజ్ భక్తుడు
సురోజీ మహరాజ్ చూపించిన మార్గంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నారు. సేవా మార్గం కంటే ఏదీ ఎక్కువ కాదు. నేటికీ ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం.
గురువు చూపించిన మార్గంలో..
-మెస్రం కైలాష్, సురోజి మహారాజ్ సంస్థానం పీఠాధిపతి
సంత్ శ్రీసురోజీ మహరాజ్ చూపించని ఆధ్మాత్మిక మార్గాన్ని నేటికీ పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరినీ ఆధ్మాత్మిక మార్గంలో నడిచేలా చేస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ సామూహిక వివాహాలు జరిపిస్తూ సురోజీ మహరాజ్ ఆశయాన్ని నెరవేరుస్తూ వస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో త్రిపుల్ తలాక్ మొదటి కేసు అదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం నమోదైంది. -
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు