ఎల్ఆర్ఎస్.. నిబంధనలు తుస్
ఆదిలాబాద్లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి.
అసైన్డ్ భూముల్లోని ప్లాట్లకూ క్రమబద్ధీకరణ
న్యూస్టుడే ఆదిలాబాద్ పట్టణం
మావల మండలం బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72/3 లోని ఈ స్థలంలో కొన్ని రోజులుగా రహదారులు, మురుగు కాలువల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించే జిల్లా సమీకృత భవన సముదాయం (కలెక్టరేట్ భవనానికి) ఆనుకొని ఉన్న పదెకరాల ఈ అసైన్డ్ భూమికి 13 ఏళ్ల కిందట ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ అయింది. ఆ తరువాత అదనపు పాలనాధికారి(జాయింట్ కలెక్టర్) ఆ ఎన్ఓసీని రద్దు చేశారు. అక్కడ క్రయవిక్రయాలు, ప్లాట్లు చేస్తే రెవెన్యూ అధికారులు పీఓటీ యాక్టు(ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) ప్రకారం స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు. అయినా ఈ వివాదాస్పద భూమిలోని కొన్ని ప్లాట్లకు మాత్రం అధికారులు ఎల్ఆర్ఎస్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయి. 1956 కంటే ముందు అసైన్డ్ చేసిన భూములకు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వడంతో దాన్ని సాకుగా చేసుకొని చాలామంది ప్లాట్లు చేసి విక్రయించారు. మరికొంత మంది నకిలీ ఎన్ఓసీలు సృష్టించి ప్లాట్ల దందా సాగించారు. అసలు ఎన్ఓసీకి అర్హత లేని భూముల్లోనూ దర్జాగా ప్లాట్లు చేశారు. ఎన్ఓసీల జారీపై ఆరేడేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్ని భూములకు జిల్లా అధికారులు ఎల్ఓసీ ఇచ్చారనేది స్పష్టత లేదు. మరికొందరు ప్రైవేటు పట్టాలు చూపించి ప్రభుత్వ భూముల్లో పాగావేసి అమ్మకాలు జరిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ సమస్య అధిగమించేందుకు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎన్ఓసీ భూముల జాబితా ఇవ్వాలని అప్పటి పురపాలక కమిషనర్ శైలజ జిల్లా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి జాబితా రాలేదు. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన మొత్తం 19 వేల దరఖాస్తుల్లో 12 వేల వరకు ఎన్ఓసీ భూముల్లోని ప్లాట్లవే కావడం విశేషం. భూములపై వివాదాలు ఉండటంతో ప్రతి పత్రం, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా అవేమి ఇక్కడ కనిపించడం లేదు. చెరువులకు 30 మీటర్ల దూరంలో, చిన్న చెరువులైతే 9 మీటర్లు, వాగులు, పెద్ద కాలువలైతే 9 మీటర్ల దూరంలో, చిన్న కాలువలకు 2 మీటర్ల దూరంలోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని నిబంధన ఉంది. ఎక్కడ వాగులు, కుంటలు ఉన్నాయనే వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల నుంచి తీసుకోవాలి. పుర అధికారులు మాత్రం ఇవన్నీ గాలికొదిలేసి ఎల్ఆర్ఎస్ ఆమోదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం..
-సాయికుమార్, పట్టణ ప్రణాళిక విభాగం సూపర్వైజర్
బట్టిసావర్గాం శివారు సర్వే నెం.72/3లోని లేవుట్లో కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసిన మాట వాస్తవమే. అక్కడ తప్పు జరిగింది. ఆ ప్లాట్ల ఎల్ఆర్ఎస్ రద్దు కోసం గత కమిషనర్కు నివేదించాం. కొత్తగా వచ్చిన పుర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయిస్తాం.
రద్దు చేయడం కష్టమే
-ఎం.డి.ఖమర్హైమద్, పురపాలక కమిషనర్
ఒకసారి ఎల్ఆర్ఎస్ చేశాక రద్దు చేయడం చాలా కష్టం. ఆన్లైన్ విధానంలో దీన్ని ఆమోదిస్తారు. ఆన్లైన్లోనే రద్దు చేయాలి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వివాదాస్పద భూముల్లోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేశారంటే అది సిబ్బంది తప్పిదమే. దీనిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!