పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది.
ఈ ఏడాది కార్యాలయంలో శిక్షకులకు సామగ్రి అందిస్తూ..
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: గ్రామీణ, పట్టణాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. గతంలో కన్నా క్రీడావిభాగాలు తగ్గించినా అనుమతి లభించినవి అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 16 చోట్ల శిబిరాలను కేటాయించగా అందులో మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల మైదానంలోనే పది శిబిరాల నిర్వహణ జరుగుతోంది. వీటి పర్యవేక్షణ డీవైఎస్ఓ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు శిబిరాల వైపే చూడలేదంటూ క్రీడాసంఘాల నాయకులు, శిక్షకుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నెలరోజులపాటు కొనసాగే ప్రత్యేక శిబిరాలు సక్రమంగా నిర్వర్తించకపోవడంపై క్రీడాకారులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సందడి లేకుండానే మొదలు..
ఏటా జిల్లా కేంద్రంలోని మైదానంలో ఉన్నతాధికారుల చేతులమీదుగా అట్టహాసంగా మొదలయ్యే వేసవి శిబిరం.. ఈ సంవత్సరం సాదాసీదాగా ప్రారంభించారు. పర్యవేక్షణ, ప్రచారం సరిగా లేకపోవడంతో నాలుగు రోజులైనా ఇంకా కొంతమందికి శిబిరం కొనసాగుతున్నట్లు తెలియడం లేదు. ఇక క్రీడా సామగ్రి పంపిణీపై శిక్షకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శిబిరం ప్రారంభంలో క్రీడాకారుల సమక్షంలో ఇవ్వాల్సిన క్రీడా సామగ్రి కార్యాలయానికి పిలిచి నాసిరకమైనవి అందించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేవని, మంచినీరు అందించే ఏర్పాటు చేయలేదని క్రీడాకారులు వాపోతున్నారు.
డీవైఎస్ఓ మైదానం.. అధికారి రారేమి?
ప్రస్తుత జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల మైదానాన్ని డీవైఎస్ఓ పేరుతోనే పిలుస్తుంటారు. కానీ ఇప్పుడున్న అధికారి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చింది లేదు. పరిస్థితిని తెలుసుకుంది లేదు. కనీసం ప్రారంభానికి రాలేదని పలువురు శిక్షకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి శిబిరాల నిర్వహణ గందరగోళంగా మారింది. ఫుట్బాల్కు సంబంధించిన శిక్షణ తప్ప ఏ క్రీడా శిబిరం కూడా కొనసాగుతున్నట్లు కనిపించడం లేదు. బాక్సింగ్ శిక్షణ నిర్విరామంగా జరుగుతున్నా అది క్రీడా ఖేలో ఇండియా పరిధిలో ఉంది. శిబిరాలకు హాజరుకాకపోగా ఎలా సాగుతున్నాయని ఆరా కూడా తీయడం లేదని క్రీడా సంఘాల సభ్యులు అంటున్నారు.
మైదానంలో ఈ గుంపును చూస్తే క్రీడాశిబిరానికి సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉంది కదూ. ఇది ఫుట్బాల్ శిబిరం నిర్వాహకులు, క్రికెట్ క్రీడాకారులకు మధ్య జరుగుతున్న వాగ్వాదం. క్రికెట్ను నిలిపివేయాలని, శిబిరానికి వచ్చే చిన్నారులకు ఇబ్బంది కలుగుతుందని ఒకరు.. రోజూ ఆడుతుండగా ఇప్పుడు కొత్తగా ఆపివేయాలనడం ఏంటని మరొకరు వాదనలు చేసుకుంటున్నారు. మైదానానికి అనేకమంది వస్తుంటారు. వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. వీరందరినీ సమన్వయం చేసి శిబిరం సాఫీగా జరిగేలా డీవైఎస్ఓ చొరవ తీసుకోవాలి. నెలరోజుల కార్యక్రమాన్ని వివరించి సహకరించేలా కోరాలి. కానీ తనకేం సంబంధం లేన్నట్లు శిక్షకులకు వదిలేయడంతో ఇలా గొడవలకు దారితీస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే