జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు
నేరడిగొండ: మాట్లాడుతున్న మంత్రి సీతక్క
నేరడిగొండ, న్యూస్టుడే: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెమట తుడుచుకునే రుమాలుపై జీఎస్టీ విధిస్తూ వీధి వ్యాపారుల, పేదల పొట్ట కొడుతూ సంపదను పెద్దలకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అధికార ప్రతినిధి పసుల చంటి, బోథ్ బ్లాక్ అధ్యక్షుడు ప్రపుల్చందర్రెడ్డి, మండల కన్వీనర్ వసంత్రావు తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు: జడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తలమడుగు పులాజీబాబా ధ్యానమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. సొనాల(బోథ్): నిర్మల్లో ఆదివారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్ అన్నారు. సొనాలలో శనివారం ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్కుమార్తో కలిసి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
గుడిహత్నూర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే గ్రామ పంచాయతీలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు దౌలత్రావు అన్నారు. మచ్చాపూర్, డొంగ్రగావ్ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నార్నూర్ : మాజీ సర్పంచి గజానంద్నాయక్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండంలోని నార్నూర్, రాజులగూడ, మాన్కాపూర్, గంగాపూర్ గోండ్గూడ, తండా, తాడిహత్నూర్, జామ్డా, గుంజాల గ్రామాల్లో తోటి నాయకులతో ప్రచారం చేశారు.
ఆదిలాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. పట్టణంలోని ప్రజాసేవాభవన్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు మేకల మధుకర్, సంజయ్ కుమార్, డి.నాగేశ్వర్, డీఎస్పీ శర్మ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, వెంకట్ కుమార్, షేక్ మునీర్, రవీందర్, ముజాహిద్, హుస్సేన్, నరేందర్, రాము, ఇమ్రాన్, భగవాండ్లు, ప్రశాంత్, కౌశిక్, మహ్మద్ సాబీర్, సద్దాం బిన్, నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉట్నూరు గ్రామీణం: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని టీపీసీసీ ఆదివాసీ రాష్ట్ర కన్వీనర్ నాగాపూర్ మాజీ సర్పంచి సునీల్ జాదవ్ కోరారు. నాగాపూర్, ఎక్స్రోడ్, శ్యాంనాయక్తండాల్లో ‘కాళ్లు మొక్కుతా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంద్రవెల్లి : కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ముకాడే ఉత్తం, నాయకులు ఇంద్రవెల్లిలో ప్రచారం నిర్వహించారు.
భీంపూర్: దనోర, వడూర్లలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఇంటింటి ప్రచారం చేశాయి. మండల కన్వీనర్ అశోక్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ అర్బన్: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి పట్టణంలోని దుర్గానగర్, శంకర్గుట్టలో ప్రచారం చేశారు.
బోథ్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బోథ్తో పాటు పొచ్చర, కౌఠ, సొనాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆడె గజేందర్లతో కలిసి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే