సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
న్యూస్టుడే, ఇచ్చోడ, బేల : జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తీరా రోగాలు తగ్గకపోవడంతో ప్రైవేటును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ముగ్గురు ఉండాల్సినచోట ఒక్కరు, ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే దిక్కయ్యారు. దీంతో అక్కడ పని చేసే సిబ్బందే మందులు ఇచ్చి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీహెచ్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్నర్సులకు ఇటీవల ఉద్యోగాలు రావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవి భర్తీ కాకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది.
తూతూమంత్రంగా విధులు..
ప్రభుత్వం పల్లె దవాఖానాల పేరుతో ఇటీవల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ ఎంఎల్హెచ్పీలను నియమించినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. చాలాచోట్ల వారు విధులకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువైపు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
మచ్చుకు మరికొన్ని..
- సొనాల పీహెచ్సీలో ఇద్దరు స్టాఫ్నర్సులు ఉండాలి. అందులో ఒకరు ఉండగా మరొకరు వేరే చోటకు డిప్యూటేషన్పై వెళ్లారు. ఓపీ ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉంది. అటెండర్ పోస్టు ఖాళీగా ఉండగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
- ఇచ్చోడ మండలం నర్సాపూర్ పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒక్కరు మాత్రమే డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. ఇతను వైద్య శిబిరాలకు వెళ్తే ఆసుపత్రిలో ఎవ్వరూ ఉండటం లేదు. వచ్చేది వర్షాకాలం కావడంతో మరో వైద్యుడిని నియమిస్తేనే ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి అనేక చోట్ల నెలకొంది.
ఒక్కరే దిక్కు
ఇది బేల మండల కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్సీ. ఇక్కడ ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరే పని చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న ముగ్గురు స్టాఫ్నర్సులకు ఉద్యోగాలు వచ్చి, వారు వేరే చోట విధుల్లో చేరడంతో ఒక్కరే దిక్కయ్యారు. వెరసి ఇక్కడ ప్రసవాలు నిలిచిపోయాయి.
ఇచ్చోడలో ఇదీ పరిస్థితి
ఇది ఇచ్చోడలోని 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్సీ. జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, మారుమూల ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా వస్తుండగా ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణ రోజుల్లో 100కుపైగా, సీజనల్ వ్యాధుల సమయంలో 200లకుపైగా రోగులు ఆసుపత్రికి వస్తారు. ఇద్దరు వైద్యులు ఉన్నా.. మరొకరిని నియమించాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ నర్సులు ఇక్కడ అయిదుగురు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. నైట్వాచ్మెన్ లేక రాత్రి వేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడాది కిందట ఇక్కడ పని చేస్తున్న అటెండర్ మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది.
భర్తీకి చర్యలు: రాఠోడ్ నరేందర్, డీఎంహెచ్ఓ
జిల్లాలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి నేపథ్యంలో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతోపాటు ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాం. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఎంఎల్హెచ్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM