logo

ఆటోను ఢీకొన్న డీసీఎం.. ఒకరి పరిస్థితి విషమం

పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.

Published : 05 May 2024 13:36 IST

ఎదులాపురం: పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఖుషినగర్‌కు చెందిన రాథోడ్‌ సికిందర్‌ తన ఆటోలో అతని అత్తను తీసుకుని జేమ్స్‌ ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని డీసీఎం ఆటోను ఢీకొంది. దీంతో రాథోడ్ సికిందర్‌, తన అత్త జమునా బాయికి తీవ్ర గాయాలయ్యాయి. సికిందర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని