సెలవు కరవు.. విధుల బరువు..
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు.
ఒత్తిడికిలోనై అనారోగ్యం పాలవుతున్న పోలీసులు, సిబ్బంది
మంచిర్యాల నేరవిభాగం, న్యూస్టుడే
సర్వీస్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది.. వయసు 35 సంవత్సరాలు రాకముందే బీపీ, షుగర్ వచ్చాయి. ఇంట్లో శుభకార్యాలకు ఉండలేని పరిస్థితి ఉంది.
ఓ కానిస్టేబుల్ ఆవేదన
వరుసగా ఎన్నికలు, ప్రముఖుల రాకపోకలు, జాతరలు రావడంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నాం. అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది.
మరో కానిస్టేబుల్ వేదన
జిల్లాకేంద్రంలో బ్లూకోట్స్లో విధులు నిర్వర్తిస్తున్న సతీష్ అనే కానిస్టేబుల్ ఆదివారం ఉదయం ఈత కొడుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై హఠాన్మరణం పొందారు. వరుస విధులతో కొద్దిరోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
‘ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యే పోలీస్స్టేషన్ మంచిర్యాల. ఏటా 650కు పైగా నమోదవుతాయి. దీనికితోడు నిత్యం ఫిర్యాదులు, ఆందోళనలు, రాజకీయ నాయకుల రాకలు, ఇతరత్రా ఇక్కడ అధికారులతోపాటు సిబ్బందికి పనిభారం తప్పడం లేదు. 62 మంది సిబ్బందికి ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి పట్టణంలో అదనపు ఠాణాతో పాటు మరో 30 మంది సిబ్బంది అవసరముంది.’
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారంలో ఒక్క రోజుకూడా కుటుంబసభ్యులతో సరదాగా గడపలేని పరిస్థితి. పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం అయిదు సంవత్సరాల క్రితం వారాంతపు సెలవులు ప్రకటించినా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. సిబ్బంది కొరత కారణంగా అవసరాన్ని బట్టి.. స్టేషన్ అధికారి అనధికారికంగా అనుమతి ఇస్తేనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. అనుకోకుండా బందోబస్తు, ఇతర నేరాలు జరిగినట్లయితే ఆ అనుమతి రద్దు చేసుకొని తిరిగి విధుల్లోకి రావాల్సిందేనని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. వీరికి అనుబంధంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. విధులకు హాజరుకాని రోజు వారి వేతనంలో కోత విధిస్తున్నారు.
సగం కన్నా ఎక్కువ ఖాళీలు..
రామగుండం పోలీసు కమిషనరేట్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కానిస్టేబుల్స్థాయి నుంచి ఎస్సై వరకు కమిషనరేట్లో 2500 మంది ఉంటారు. సిబ్బంది కొరత ఉండడంతో వారాంతపు సెలవులు అమలు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. రామగుండం పోలీసు కమిషనర్గా విధులు నిర్వర్తించిన విక్రమ్జిత్ దుగ్గల్ 2017 నవంబరులో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులకు శ్రీకారం చుట్టారు. ఇది కొద్దిరోజులే అమలుకు నోచుకుంది. తర్వాత అధికారులు మారడంతో వారాంతపు సెలవులు సైతం నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్