అతివేగం.. బతుకులు ఆగం..
చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
గాలిలో కలుస్తున్న విలువైన ప్రాణాలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ నేర విభాగం
చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యువాత పడి కుటుంబ సభ్యులు వారిపై పెట్టుకున్న ఆశలను నీరుగారుస్తూ విషాదాన్ని మిగులుస్తున్నారు. జిల్లాలో రెండు నెలల్లోనే 71 ప్రమాదాలు చోటు చేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. జాతీయ రహదారి 44పై గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగొంది, మావల సమీపంలోని దేవాపూర్ చెక్పోస్టు, మావల బైపాస్ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం అతి వేగం, ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంద్రవెల్లి మండలం ఇన్కô్గూడ వద్ద అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్కు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇద్దరు యువకుల దుర్మరణం
నార్నూర్ మండలం చోర్గాం గోండ్గూడ చెందిన దుర్వ చందు(27), ఆడ మధుకర్(20) ద్విచక్ర వాహనంపై అతి వేగంగా ప్రయాణిస్తూ ఇంద్రవెల్లి మండలం ధనోరా(బి)-ఇన్కర్గూడ మధ్య ఆర్టీసీ బస్సును ఏప్రిల్ 26న ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్కు తరలించగా అదే రోజు అర్ధరాత్రి మృతి చెందారు.
జూనియర్ అసిస్టెంట్ దుర్మరణం
ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే అక్షయ్(25) కారును నిర్లక్ష్యంగా అపసవ్య దిశలో నడుపుతూ 44వ జాతీయ రహదారిపై నడుపుతూ ఏప్రిల్ 9న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాల పాలవ్వగా నిజామాబాద్కు తరలించి చికిత్స అందించారు. 13న చికిత్స పొందుతూ మృతి చెందారు.
ముందున్న కంటైనర్ను ఢీకొని
44వ జాతీయ రహదారిపై మావల బైపాస్ సమీపంలో ఏప్రిల్ 1న ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొంది. కారు ముందు భాగం కంటైనర్ వెనుక ఇరుక్కుపోయింది. ప్రమాద తీవ్రతకు కారులోని బెలూన్లు సైతం పగిలిపోయాయంటే కారు వేగాన్ని అంచనా వేయొచ్చు. ఈ ప్రమాదంలో డీఆర్డీఏలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజు దుర్మరణం పాలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
జిల్లా కేంద్రం సమీపంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. దంపతులిద్దరు గాయాలపాలయ్యారు. కేఆర్కే కాలనీకి చెందిన కాంబ్లె భీంరావు, భార్య లక్ష్మీ ఆదిలాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొనటంతో రోడ్డుపై పడిపోయారు. ద్విచక్రవాహనం బస్సు టైర్ల కిందకు దూసుకెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్