logo

ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుంది

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు సంతోష్, నారాయణ అన్నారు.

Published : 07 May 2024 11:01 IST

తాంసి: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు సంతోష్, నారాయణ అన్నారు. మంగళవారం తాంసి మండల కేంద్రంలో ఇంటింటా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. రైతుబంధుతో పాటు రుణమాఫీ త్వరలో అమలవుతుందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి, రామన్న యాదవ్, గంగారెడ్డి, నరేష్ బాబు, వెంకట్ రెడ్డి, అశోక్, రాకేష్ యాదవ్, నితిన్ కుమార్, దేవిదాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని