రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది.
నేడు ప్రపంచ తలసీమియా దినోత్సవం
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్టుడే: తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతూ జిల్లాలో వందలాది మంది చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. వీరు బతకాలంటే క్రమం తప్పకుండా శరీరంలోకి రక్తం ఎక్కించుకోవాల్సిందే. అవసరమైన మందులు వాడాల్సిందే. బాధితులకు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రెడ్క్రాస్, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలతో ఉచితంగా రక్తం, మందులు, రవాణా ఖర్చులు ఇవ్వడమే. అంతకుమించి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేసింది లేదు. ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వంతో పాటు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పడే కేంద్ర ప్రభుత్వమైనా ఈ భయంకరమైన వ్యాధి నిర్మూలనకు పరిష్కారం చూపించాలని ఆశిద్దాం. బుధవారం ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కథనం..
ఈ రోగం బారిన పడిన వారందరూ దాదాపు పేదలే కావడంతో పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ మహమ్మారికి చికిత్స ఉందని, నయం అవుతుందని తెలిసినా ఏ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. బోన్మ్యారో చికిత్సతో ఈ రక్తపిశాచి నుంచి బయటపడే అవకాశముంది. రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నా ఖర్చుతో కూడుకుంది అని నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ స్థాయితో పాటు పలు రకాల చికిత్సలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిత్యం ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తలసీమియా చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందులో చేర్చలేకపోతుంది. తాత్కాలిక ఉపశమనంగా పక్షం రోజులకు ఓ యూనిట్ రక్తం, మాత్రలు అందిస్తుందే తప్ప శాశ్వత చికిత్సకు మొగ్గుచూపడం లేదు.
సంకల్ప్ చేయూత..
తలసీమియా వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు, పునర్జన్మ ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం అభినందనీయం. సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ బెంగళూరులోని మహావీర్జైన్ ఆసుపత్రిలో బోన్మ్యారో చికిత్సను అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రిలో చికిత్సకు రూ.10 లక్షలు అవుతుండగా ఫౌండేషన్ రూ.5 లక్షలు భరిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ సహకారం(రూ.3లక్షలు) వస్తుండటంతో బాధితుడికి ఉపశమనం కలుగుతుంది. ఈ చికిత్సకు ప్రధానంగా కావాల్సింది హెచ్ఎల్ఏ(హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్)పరీక్షలో ఆయా బాధితుల కుటుంబసభ్యుల బోన్మ్యారో సరిపోవడమే. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒకరికి విజయవంతం కాగా మరో నలుగురు చికిత్సకు సిద్ధమవుతున్నారు. బోన్మ్యారో చికిత్సను సింగరేణి ఆరోగ్యకార్డుతో పూర్తిగా ఉచితంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సిటిజన్ హాస్పిటల్స్లో ఇప్పటికే సంబంధిత కార్మిక కుటుంబాలకు చెందిన ముగ్గురు బాధితులు ఇటీవల బోన్మ్యారో చికిత్స విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం సైతం ఈ వ్యాధికి చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తే వేలమందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన సతీష్-రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురికి ఏడాదిన్నర వయసులోనే తలసీమియా వ్యాధిని గుర్తించారు. కొంతకాలంగా రక్తం స్వీకరిస్తుండగా ఇటీవల చేసిన హెచ్ఎల్ఏ పరీక్షలో సోదరుడి బోన్మ్యారో సరిపోవడంతో చికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. రెడ్క్రాస్ సొసైటీ, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బెంగళూరులోని ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటుందని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధిత బంధువుల కణాలు సరిపోయి దానానికి ముందుకొస్తే 15 ఏళ్ల లోపు చిన్నారులందరూ తలసీమియా నుంచి ఉపశమనం పొందవచ్చని తెలుపుతున్నారు.
ఇటీవల రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తలసీమియా వ్యాధిపై అవగాహన పెంచేందుకు వారం రోజుల పాటు సదస్సులు నిర్వహించింది. దీని బారినపడకుండా వివాహానికి ముందు హెచ్బీఏ 2 పరీక్షను చేసుకోవాలని సూచించింది. వేసవికాలం కావడం, రక్తనిల్వల కొరత ఏర్పడుతుండటంతో ప్రస్తుత బాధితుల అవసరంరిత్యా రక్తదానానికి ముందుకురావాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం