logo

హజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

ఈ ఏడాదిలో జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడానికి  కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 

Published : 08 May 2024 13:13 IST

ఎదులాపురం: ఈ ఏడాదిలో జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడానికి  కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.  63 మంది యాత్రికులు గురువారం హజ్‌యాత్రకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో హజ్ కమిటీ అధ్యక్షుడు షాహిద్ అహమ్మద్ తవక్కల్‌ను స్థానిక మొహమ్మదియా మదర్సా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే  యాత్రికులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖిజర్ మౌలానా, అహ్మద్ రంజాన్, సర్తాజ్ అహ్మద్, మొహమ్మద్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని