వసతులు కరవు.. బతుకు బరువు!
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న గ్రామస్థులు
చెలమ నీరు తోడుకుంటున్న దాబగూడవాసులు
ఆసిఫాబాద్, తిర్యాణి, న్యూస్టుడే: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కానీ వారు జీవనం సాగిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు విఫలం అవుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ ఆయా గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ఎవరు వచ్చినా తమకు ఒనగూరేది ఏమీ లేదని భావించిన ఆ గ్రామస్థులు.. ఓటింగ్కు దూరంగా ఉంటామంటున్నారు. ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెన పంచాయతీ పరిధిలోని గ్రామస్థులు మూడు రోజుల కిందట కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎడ్లబండిపై రేషన్ సరకులు తెచ్చుకుంటున్న గోవెన గ్రామస్థులు
జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మండలం తిర్యాణి. ఈ మండలంలోని గోవెన పంచాయతీ పరిధి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ గోండ్గూడ, కొలాంగూడ, నాయకపుగూడ, కర్సుగూడ, దాబగూడ.. ఇలా అయిదు గూడేలు ఉన్నాయి. మొత్తం 69 కుటుంబాలు 361 జనాభా ఉంది. 136మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా పంచాయతీ కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే ఈ గూడేలు వసతుల లేమితో అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. మండల కేంద్రం నుంచి సుమారు 25-30 కి.మీ. దూరంలో ఈ పంచాయతీ కేంద్రం ఉంది. నేటికీ బీటీ రోడ్డు లేదు. మట్టి రోడ్డే దిక్కు. మధ్య మధ్యలో గుట్ట ప్రాంతం, వాగులు ఉన్నాయి. ఈ గ్రామానికి 108, 102 ఇతర ఏ వాహనాలు వెళ్లలేని దుస్థితి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే దేవునిపైనే భారం వేయాల్సి వస్తోంది.
వానాకాలంలో దయనీయ పరిస్థితి
వానాకాలంలో వీరి పరిస్థితి దయనీయంగా మారుతుంది. మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రావాలన్నా మధ్యలో వాగులు దాటాల్సి వస్తుంది. అవి ఉప్పొంగి ప్రవహించిన సమయంలో బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిందే. ఎడ్లబండ్లే వీరి రవాణా సాధనం. గూడేల్లో బావులు ఉన్నా.. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. భగీరథ నీరు సక్రమంగా రావడంలేదు. వాగుల వద్ద చెలమల నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. నాయకపు గూడకు ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం లేదు. రాత్రివేళ చీకట్లలోనే గడపాల్సిన పరిస్థితి. చరవాణి సంకేతాలు సైతం అందుబాటులో లేవు.
గోవెన గ్రామానికి వెళ్లే దారి
రేషన్కు అటు.. నిత్యావసరాలకు ఇటు
ఈ గూడేలవాసులు రేషన్ సరకుల కోసం 10 కిలోమీటర్ల దూరంలోని పంగిడిమాదరకు, ఆసరా పింఛన్ల కోసం 20 కి.మీ. దూరంలోని సుంగపూర్కు వెళ్తుంటారు. ఎడ్లబండ్లు కలిగిన వారు.. వాటిపై, లేని వారు నెత్తిన మూటలతో బియ్యం, ఇతర సరకులు మోసుకుని కాలినడకన వెళ్లాల్సిందే. చాలా మంది నిత్యావసర సరకులు, ఇతర అవసరాలకు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. గోవెన నుంచి పది కిలోమీటర్లు కాలినడకన ఆసిఫాబాద్ మండలం బల్హాన్పూర్కు రావాలి. అక్కడి నుంచి సుమారు 20 కి.మీ. వాహనాల్లో జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ఏటా వర్షాకాలంలో సరకుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తుగా తెచ్చిపెట్టుకుంటుంటారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం పక్కా రోడ్డయినా ఏర్పాటు చేయాలని దీనంగా వేడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!