మూగజీవాల దాహం కేకలు
మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు
నీటి తొట్టెలపై నిర్లక్ష్యం
న్యూస్టుడే, తలమడుగు
తలమడుగు మండలం కజ్జర్లలోని ఓ చెరువులో నీటిని తాగేందుకు పరుగులు పెడుతున్న ఆవులు, గేదెలు
మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నిర్మించడంతో నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. దీంతో పశువుల దాహార్తి తీరకపోగా నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. వేసవి తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటుతుండటంతో గుక్కెడు నీటికి మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఏడాదిన్నర కిందట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 766 నీటి తొట్టెలు మంజూరయ్యాయి. ఒక్కో తొట్టెకు రూ.22,000 చొప్పున మొత్తం రూ.1.66 కోట్లు కేటాయించారు. మంజూరైన వాటిలో దాదాపు 396 తొట్టెల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణ దశలో 200 ఉండగా నిరుపయోగంగా 170 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు 3,50,000, గొర్రెలు, మేకలు 1,95,000 ఉన్నాయి. ఎండలు తీవ్రమవుతుండగా, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో మూగజీవాలు గుక్కెడు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
పట్టింపు ఏది?
వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెలను వినియోగంలోకి తేవాలి. అయినా పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీశాఖ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీటికి నీటి సరఫరాపై దృష్టి సారించడం లేదు. ఏడాది నుంచి ఉపాధి హామీ పథకంలో భాగంగా వీటి నిర్మాణాన్ని తొలగించారు. దీంతో మూగజీవాల దాహార్తికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నీటి కోసం వెళ్లి మృత్యువాత
ఇక్కడ కనిపిస్తున్న చిత్రం సుంకిడి గ్రామంలోనిది. కుచులాపూర్కు చెందిన రమణయ్యకు సంబంధించిన మూడు గేదెలు తాగు నీటికి మత్తడివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరగగా మృత్యువాత పడ్డాయి. వాస్తవానికి కుచులాపూర్ చెరువుల్లో నీటి నిల్వ ఉంటే అయిదు కిలోమీటర్ల దూరంలోని ప్రాజెక్టు వద్దకు వచ్చేవి కావు.
నిరుపయోగంగా నీటితొట్టె
తలమడుగు మండలం ఝరి పంచాయతీ పూనగూడలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టె నిర్మించారు. వాస్తవానికి ట్యాంకుకు అనువైన స్థలంలో నీటి తొట్టె నిర్మించి ట్యాంకు ద్వారా పైపులైన్తో నీరు సరఫరా చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అనువుగాని చోట నిర్మించారు. ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
నిధులు లేక ఇబ్బందులు
ఫణీందర్రావు, ఇన్ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో నూతన నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీల్లో అవసరమైన నిధులు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!