logo

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated : 09 May 2024 16:26 IST

ఎదులాపురం: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మూడు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించామని ఆయన వెల్లడించారు. ఈ కేసు వివరాలను గురువారం డీఎస్పీ మావల పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. వ్యభిచార నిర్వాహకులు, విటులు మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, రూ: 7,500 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని