ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం (పాత చిత్రం)
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఓటు హక్కును బాధ్యతగా గుర్తించడానికి, ఎన్నికల సంఘం అధికారులు కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లాలో శతశాతం ఓటింగే లక్ష్యంగా మహిళ, యువత, దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
ఆదర్శ పోలింగ్ కేంద్రాలను శుభకార్యాలు జరిగినట్లు కాగితపు పూలు, బెలూన్స్, కొబ్బరి మట్టలతో ఆలంకరిస్తారు. అక్కడికి వచ్చే ఓటర్లకు గ్రీన్, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినట్టు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు.
మహిళా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది అంతా అతివలే ఉంటారు. మరోచోట దివ్యాంగులు, ఇంకోచోట యువ ఉద్యోగులే ఎన్నికల విధులు నిర్వహించనుండటం వీటి ప్రత్యేకత.
మంచిర్యాల..
- మహిళా పోలింగ్ కేంద్రాలు: దండేపల్లి జడ్పీఎస్ఎస్, అంకత్పల్లి ఎంపీపీఎస్, దొనబండ జడ్పీహెచ్ఎస్, మంచిర్యాల గల్స్ హైస్కూల్, నస్పూరు ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ఎంపిక చేయగా,
- దివ్యాంగులు: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- ఆదర్శ: నస్పూరు ఎంపీయూపీఎస్, గుల్లకోట ఎంపీయూపీఎస్, ముల్కల్ల జడ్పీఎస్ఎస్, మంచిర్యాల కేంద్రీయ విద్యాలయం, నస్పూరు సింగరేణి హైస్కూల్
- యువత: మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల
చెన్నూరు..
- సీఈఆర్ క్లబ్, ముదిగుంట జడ్పీఎస్ఎస్, భీమారం ఎంపీపీఎస్, కత్తెరశాల ఎంపీయూపీఎస్, కోటపల్లి జడ్పీఎస్ఎస్
- ఎల్లక్కపేట
- మైన్స్ ఒకేషనల్ ట్రెనింగ్ సెంటర్, శివ్వారం గ్రామ పంచాయతీ భవనం, పోలంపల్లి ఎంపీపీఎస్, అంగన్రాజ్పల్లి ఎంపీయూపీఎస్, మల్లంపేట్ జడ్పీఎ
- లింగన్నపేట
బెల్లంపల్లి..
- దేవాపూర్, తాళ్ల గురిజాల జడ్పీఎస్ఎస్, తాండూరులోని రాజీవ్నగర్ గ్రామపంచాయతీ భవనం, జన్కపూర్ జడ్పీహెచ్ఎస్
- బెల్లంపల్లిలో బజార్ ఏరియా జడ్పీఎస్ఎస్
- సోమగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం, తాండూరులో జడ్పీఎస్ఎస్, దుబ్బగూడెంలో ఎంపీయూపీఎస్, భీమిని ఎంపీపీఎస్, వేమనపల్లి ఎంపీపీఎస్
- బెల్లంపల్లి జూనియర్ ప్రభుత్వ కళాశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్