గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి.
న్యూస్టుడే, రాంనగర్ : ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. లోక్సభ నియోజకవర్గం ఎస్టీకి కేటాయించడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ గోండు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో గిరిజనేతరుల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉండగా, గిరిజన సంఘాల నేతల లెక్కల మేరకు 3.55 లక్షల ఓట్లు గిరిజనులవి ఉన్నాయి. మిగిలిన 12.94 లక్షల ఓట్లు గిరిజనేతరులవే. వీటిని వర్గాల వారీగా రాబట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనుల జిల్లాగా ప్రసిద్ధి చెందింది. 240కి పైగా గ్రామాలు నోటిఫైడ్ గ్రామాలు ఉన్నాయి. గిరిజనులతో పాటు ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు సైతం నివసిస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో సాగు చేస్తున్న భూములకు పట్టా సమస్య ఉంది. గత ప్రభుత్వం గిరిజనులతో పాటు గిరిజనేతరుల భూ సమస్యను పరిష్కరించేందుకు దరఖాస్తులు చేసుకోమని చెప్పింది. వారి నుంచి ఆధారాలతో సహా దరఖాస్తులు తీసుకున్నారు. తీరా గిరిజనులకు అటవీహక్కు పత్రాలు ఇచ్చేసి, గిరిజనేతరుల సమస్య అలాగే వదిలేశారు. ఏజెన్సీ ఏరియాల్లో 40 వేల మంది రైతులు కొన్నేళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నారు. పట్టా పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ల భూములు నోటిఫైడ్ గ్రామాల్లో ఉండటంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే మిగిలిన గ్రామాల్లో గిరిజనేతరులే ఎక్కువగా ఉన్నారు. వీళ్ల ఓట్లు రాబట్టుకునేందుకు వర్గాల వారీగా కుల సంఘాలతో సమావేశాలు పెడుతున్నారు.
ప్రత్యేక దృష్టి
గిరిజనేతరుల ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. స్వయం ఉపాధితో పాటు పరిశ్రమల ఏర్పాటు, విద్యావకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు మేలు చేసే కుప్టి, కుమురం భీం తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు, రైల్వే మార్గం పొడిగింపు తదితర హామీలను అభ్యర్థులు సైతం చెబుతున్నారు. నిర్మల్ జిల్లా పరిధిలో ఉండే బీడీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు, బోథ్, ఆసిఫాబాద్, భారాస, ఖానాపూర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల ప్రాబల్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం ఎక్కువ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో పార్టీలు ఉన్నాయి. అసమ్మతి నేతలను పార్టీలో చేర్చుకోవడంలో ప్రాధాన్యమిస్తున్నాయి. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గిరిజనుల ఓట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నా, వాటిలో కూడా గిరిజనేతరుల ఓట్లు కీలకంగా ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
-
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు