సరిహద్దుపై నజర్
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
ప్రాణహిత తీర ప్రాంతాల్లో బలగాల మోహరింపు
కోటపల్లి, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించారు. మారుమూల కోటపల్లి, వేమనపల్లి మండలాల మీదుగా పొరుగున మహారాష్ట్రతో ప్రాణహిత నది మీదుగా జరుగుతున్న రాకపోకలతోపాటు మావోయిస్టు ప్రభావిత గ్రామాలను డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు.
మహారాష్ట్రతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల పోలీసులు-మావోయిస్టుల మధ్య తరచూ జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులతోపాటు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో ఎలాంటి అలజడులకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా తమదైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుండగా మరోవైపు స్థానిక పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
- జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం లేకున్నప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇరు మండలాల్లో గతంలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి గతంలో సానుభూతిపరులుగా ఉన్న సుమారు 72 మందిని గుర్తించి ముందస్తు బైండోవర్ చేశారు. ప్రాణహిత సరిహద్దులోని చెన్నూరు నుంచి కోటపల్లి, వేమనపల్లి, బెజ్జూరు మండలాల వరకు అప్రమత్తంగా ఉండాలనే ఉన్నత యంత్రాంగం ఆదేశాల మేరకు స్థానిక పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపడుతోంది. అడవులను జల్లెడ పడుతుండటంతో పాటు రహదారులు, కల్వర్టులను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
సిబ్బందికి సూచనలు చేస్తున్న సీపీ, పాలనాధికారి(పాత చిత్రం)
నిఘా కట్టుదిట్టం
కోటపల్లి, వేమనపల్లి మండలాలగుండా ప్రాణహిత నది మీదుగా రాకపోకలు సాగించే ఫెర్రీ పాయింట్లను గుర్తించి ఆయా మార్గాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తీర ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తూ అనుమానిత వ్యక్తుల సంచారంపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తున్నారు.
అదనపు బందోబస్తు
కోటపల్లి మండలం నక్కలపల్లి, పంగిడిసోమారం, బొప్పారం, అన్నారం, జనగామ, వెంచపల్లి, రొయ్యలపల్లి, ఆల్గామ, పుల్లగాంతోపాటు వేమనపల్లి మండలం కళ్లెంపెల్లి, ముక్కిడిగుడెం, వేమనపల్లి, రాచర్ల, జాజులపేట, రాచర్ల, నాగారం, లక్ష్మీపూర్, జిల్లెడ బద్దెంపల్లి తదితర గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, గ్రామాల్లో ఇది వరకే కొన్నింటిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అల్లర్లు, అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణం అప్రమత్తమయ్యేలా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సునిశిత పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పూర్తయ్యే వరకు సాధారణ సిబ్బందే కాకుండా సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్కు సంబంధించి ఒక్కో పోలింగ్ కేంద్రానికి అయిదుగురుతో కూడిన అదనపు సిబ్బందిని ఉంచేలా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 5 రూట్లుగా విభజించి క్యూఆర్టీ బృందాలను అందుబాటులో ఉంచారు. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బందితో పర్యవేక్షించనున్నారు. ఎలాంటి గొడవలు జరిగినా పది నిమిషాల్లో సంబంధిత ప్రాంతానికి చేరేలా ఈ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు సీఐ, ఎస్సైలు తమతమ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలను సందర్శించేలా ఆదేశాలు జారీచేశారు. అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద వివిధ శాఖలకు చెందిన సుమారు 13 మంది మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
వెంకటేశ్వర్లు, జైపూర్ ఏసీపీ
సరిహద్దు మండలాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్శాఖ తరఫున భద్రతా ఏర్పాట్లు చేశాం. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పిపోయిన చిన్నారులను చైల్డ్ లైన్కు అప్పగింత
[ 20-05-2024]
జిల్లా కేంద్రమైన అదిలాబాదులోని పంజాబ్ కూడలిలో ధనలక్ష్మి లాడ్జీ వద్ద ఏడుస్తూ ఉన్న ఇద్దరు తప్పిపోయిన చిన్నారులను స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ చైల్డ్ లైన్కు అప్పగించారు. -
ప్రశాంతంగా టెట్
[ 20-05-2024]
ఉపాధ్యయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. -
ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి
[ 20-05-2024]
జనాభా ప్రాతిపదికన రెండో ఏఎన్ఎంలను నియమించి పని భారాన్ని తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే