మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
భైంసాలో మాజీ మంత్రి కేటీఆర్
నిర్మల్ రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, భారాస నేతలు
భైంసా, నిర్మల్, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నిర్మల్ పట్టణం, భైంసాలో పర్యటించారు. సాయంత్రం 5:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా భైంసా చేరుకున్న కేటీఆర్ నిర్మల్-బాసర మార్గంలోని బైపాస్ రహదారి నుంచి ఆటోనగర్, వివేకానంద చౌక్ మీదుగా పాత పోస్టాఫీసు వద్ద 7 గంటలకు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్, భాజపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారని, చేశారా అని ప్రశ్నించారు. రైతు భరోసా కింద రూ.15వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు పింఛను రూ.4వేలు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎప్పుడిస్తారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ సారి మోసపోవద్దని, కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే అందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ముథోల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, విఠల్రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెడితే ఓడిపోయారన్నారు, పార్టీ మారిన ఆయన గురించి మాట్లాడేది లేదన్నారు. ఒక్కరు పోతే నలుగురు వచ్చారని, వారితో పార్టీని నిలబెట్టుకుందామన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పదేళ్లలో మత రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఎన్నో నిధులు ఇచ్చిన మోదీ తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదన్నారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగి దేశాన్ని దోచి అదానీకి ఇస్తున్నారని ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే మోదీ తత్వమని ఎద్దేవా చేశారు. రాముడు అందరికీ దేవుడని, ఆయన ఆదర్శం ఇదేనా అని ప్రశ్నించారు. రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పి, ఎంపీ అభ్యర్థి అత్రం సక్కును గెలిపించాలని కేటీఆర్ కోరారు. అనంతరం నిర్మల్కు బయలుదేరారు.
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
కేటీఆర్ రోడ్షో విజయవంతం కావడంతో భారాస శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. నిర్మల్లో సాయంత్రం 6.30 గంటలకు రావాల్సిన కేటీఆర్ 8.50 గంటలకు వచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్తోపాటు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల పాటలతో ఉత్సాహ పరిచారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భైంసా, నిర్మల్ రోడ్డుషో కార్యక్రమాల్లో నిర్మల్, ఆదిలాబాద్ జడ్పీ ఛైర్పర్సన్లు విజయలక్ష్మి, జనార్దన్, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్నాయక్, నిర్మల్ నియోజకవర్గ పరిశీలకులు యూసుస్ అక్బాని, సమన్వయకర్త రాంకిషన్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు జీవన్రెడ్డి, చారులత, జానుబాయి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు డా.సుభాష్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ప్రధాన కార్యదర్శి నజీరొద్దీన్, సమన్వయ కమిటీ నాయకులు పి.రమాదేవి, విలాస్ గాదేవార్, డా.కిరణ్ కొమ్రెవార్, లోలం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్లో రాత్రి భోజనం
ఖానాపూర్: భైంసా, నిర్మల్ రోడ్షోల అనంతరం కేటీఆర్ గురువారం రాత్రి ఖానాపూర్ వచ్చారు. భారాస ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సన్నాయక్ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటోలు దిగడానికి స్థానిక నాయకులు పోటీపడ్డారు. అనంతరం కేటీఆర్ రోడ్డు మార్గాన సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్