పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం!
రిటర్నింగ్ అధికారి రాజర్షిషా పిలుపు
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. ఎండల దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్ రోజును సెలవుదినంగా కాకుండా పండగ రోజులా భావించి ఓటేసేందుకు రావాలి’ అని ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షిషా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఎంపీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న దృష్ట్యా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ’న్యూస్టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం
న్యూస్టుడే : ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ తగ్గకుండా తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
పాలనాధికారి : ఎండల ప్రభావం ఓటర్లపై పడకుండా పోలింగ్ కేంద్రాల్లో నీడ కోసం షామియానాలు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం. చల్లని తాగునీటి వసతి కల్పిస్తాం. సిబ్బందికి కూలర్లు పెట్టిస్తున్నాం. అవసరం ఉన్న చోట ఓటర్లకూ కూలర్లు అందుబాటులో ఉంచుతాం. ఏఎన్ఎం, ఆశాలు ఓఆర్ఎస్, మందులతో సిద్ధంగా ఉంటారు.
న్యూ : వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా?
పా : పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులను, వయోవృద్ధులు, గర్భిణులను ఆటోల్లో తరలించి వారికి నేరుగా ఓటేసే అవకాశం కల్పిస్తున్నాం. దివ్యాంగులకు చక్రాల కుర్చీలు ఉంచి వాలంటీర్ల సాయంతో వారిని లోనికి తీసుకెళ్లి ఓటు వేయించే వెసులుబాటు కల్పిస్తాం.
న్యూ : పోస్టల్, హోం ఓటింగ్కు స్పందన ఎలా ఉంది?
పా : పోస్టల్ ఓటు వినియోగంలో రాష్ట్రంలోనే మన పార్లమెంటు స్థానం ముందంజలో ఉంది. దాదాపు 15 వేల మంది పోస్టల్ ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు 13 వేలకు పైగా ఓటేశారు. ఒక రోజు సమయం ఉన్నందున మిగిలినవారూ వేస్తారని భావిస్తున్నాం. ఇక హోం ఓటింగ్ 95 శాతం నమోదైంది.
న్యూ : ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్ పరీక్షల దృష్ట్యా గురుకులాలు, వసతిగృహాల్లో ఉంటున్న వారికి ఓటేసే అవకాశం ఇవ్వరనే మాట విద్యార్థుల నుంచి వినిపిస్తోంది. వారు ఓటేసేలా చొరవ చూపుతారా?
పా : డిగ్రీ విద్యార్థులంతా ఓటేయాలని కళాశాలల్లో ప్రచారం చేశాం. ఆదివారంతో పాటు పోలింగ్ రోజైన సోమవారం సెలవు ఉన్నందున ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా వారి ఇళ్లకు పంపాలని సంబంధీకులకు ఆదేశాలిస్తాం. వారంతా విధిగా ఓటేసేలా చూడాలని సూచిస్తాం.
న్యూ : పోలింగ్కు 48 గంటల ముందు ఎలాంటి చర్యలు ఉంటాయి?
పా : ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి, మిగిలిన అయిదు చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం నిలిపేయాలి. బయట ప్రాంత వ్యక్తులు ఉంటే వెళ్లిపోవాలి. అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నగదు రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే ఆధారాలు చూపించాలి.
న్యూ : పోలింగ్ కేంద్రం దూరంగా ఉండటంతో ఎండల దృష్ట్యా ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు?
పా : ఈ విషయమై మాకు విజ్ఞప్తులు వచ్చాయి. ఎక్కడైతే అలాంటి అవసరం ఉందో అక్కడి ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించాలని మా సిబ్బందికి ఆదేశాలిస్తాం.
న్యూ : కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఏరియాలో 70 శాతం మించి పోలింగ్ కాలేదు. ఈ సారి ఆ శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యలేమిటి?
పా : ప్రతి గ్రామం, పట్టణం అన్ని చోట్ల ఓటరు చైతన్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాం. విద్యార్థుల చేత సంకల్ప పత్రాలను ఇంటింటికి పంపించి ఓటు వేయాలని వారితో చెప్పించాం. జిల్లాలో 93 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. ఆసిఫాబాద్, సిర్పూర్ మినహా మిగిలిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓటేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినందున పోలింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నాం.
న్యూ : కీలకమైన పోలింగ్ సిబ్బంది కోసం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈవీఎంలు అప్పగించాక స్వస్థలాలకు రవాణా కల్పించాలంటున్నారు.
పా : పార్లమెంటు పరిధిలో ఈసారి వారి హోదాను బట్టి ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నాం. ఎండకు అలసి పోకుండా కూలర్లు పెట్టిస్తున్నాం. ప్రత్యేక మెనూతో పాటు తరచూ మజ్జిగను పంపిణీ చేయిస్తున్నాం. స్వస్థలాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేస్తాం.
న్యూ : సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు?
పా : పార్లమెంటు పరిధిలో 250 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రత్యేక భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
న్యూ : చివరగా ఓటర్లకు మీరిచ్చే సందేశం?
పా : బీఎల్వోలు ఇచ్చిన ఓటరు స్లిప్పులతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకురావాలి. ఎండలో ఏం వెళ్తామని నిర్లక్ష్యం చేయకుండా పండగలా భావించి ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటువేయాలి. అయిదేళ్లకు తమకు నచ్చిన అభ్యర్థిని, దేశ భవిష్యత్తుకు పాటుపడే ప్రభుత్వం ఏర్పడేందుకు ఓటును తప్పక వినియోగించుకోవాలి. నేనూ ఇక్కడే ఓటు వేయబోతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు