logo

ఎన్నికల్లో భాజపాను ఓడించాలి

భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు.

Updated : 10 May 2024 16:56 IST

ఎదులాపురం: భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల జనరల్ బాడీ ముఖ్య కార్యకర్తల సమావేశం అజ్మీర వినోద్ కుమార్ అధ్యక్షతన స్థానిక కుంమురం భీమ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా దేశ ప్రజలను నిలువునా దోపిడీ చేసిందన్నారు. భాజపా ప్రభుత్వ సంస్థలను కార్పొరేటర్లకు అమ్మేసిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను గణనీయంగా పెంచిందన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ శక్తులు మళ్లీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం, హక్కులు లేకుండా పోతాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు