logo

హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బృందం

హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది.

Updated : 10 May 2024 16:57 IST

ఎదులాపురం: హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది.  పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ ద్వారా 29 మంది యాత్రికులకు స్థానికులు, కుటుంబ సభ్యులు పూలమాలలతో సత్కరించి సాగనంపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు జెండా ఊపి హజ్ కు వెళ్తున్న ప్రయాణికుల బస్సును ప్రారంభించారు. ఎలాంటి అవాంతరాలు, ఆవరోధాలు లేకుండా అల్లా దయవల్ల ఈ యాత్ర విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు