ఖరీఫ్కు రూ.500 కోట్ల రుణం
వచ్చే ఖరీఫ్ కాలానికి రూ.500 కోట్ల మేర పంట రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు.
హక్కుదార్లకు రుణ పత్రాన్ని అందిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్,
ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
పాడేరు, న్యూస్టుడే: వచ్చే ఖరీఫ్ కాలానికి రూ.500 కోట్ల మేర పంట రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. 2022-23 ఆర్థిక సంఘం రుణ ప్రణాళిక అమలుపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, చిన తరహా పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ, వ్యవసాయ, డీఆర్డీఏ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణతో పాటు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రబీకి రూ.447 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి రూ.206 కోట్ల వరకు మంజూరు చేశారని మిగిలిన రూ.231 కోట్ల పంట రుణాలు త్వరితగతిన అందజేయాలన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులకు రుణాలందించాలని ఆయన బ్యాంకర్లను కోరారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అటవీహక్కు పత్రాలకు తొలిసారి రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా 23 మంది ఆర్వోఎఫ్ఆర్ హక్కుదార్లకు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున ఆమె అందించారు. అందుతున్న రుణాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బీమా పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. పీఎంఈజీపీ పథకంలో వ్యవస్థాపక అభివృద్ధిపై శిక్షణ పూర్తి చేసుకున్న 38 మంది ధ్రువ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూబీఐ ఆర్ఎం నటరాజన్, గ్రామీణ వికాస్ బ్యాంకు ఆర్ఎం ఉదయ్ కిరణ్, ఎల్డీఎం రవితేజ, మెప్మా పీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో జగన్నాథరాజు, డీసీసీబీ సీఈవో వర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?