సహాయం అందకుంటే చెప్పండి
గోదావరి, శబరి నదుల వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పేర్కొన్నారు. సోమవారం కూనవరం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.
వరద బాధితులతో ముఖ్యమంత్రి జగన్
ఈనాడు రంపచోడవరం, చింతూరు, న్యూస్టుడే: గోదావరి, శబరి నదుల వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పేర్కొన్నారు. సోమవారం కూనవరం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. గత నెల వరదల సమయంలో ప్రతి బాధితుడిని ఆదుకోవాలని, వారికి కావాల్సిన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు ఫొటోలు దిగే ముఖ్యమంత్రిని కానని తెలిపారు. బాధితులను ఆదుకునేలా ప్రణాళికలు వేసి తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దీనికోసం వారంపాటు కలెక్టర్తో సహా అధికారులంతా ముంపు ప్రాంతాల్లోనే ఉండి బాధితులను అన్నివిధాలా ఆదుకున్నారని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో ఏమాత్రం అలసత్వం లేకుండా సచివాలయాల నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి తోడ్పాటు అందేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
బాధితుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కలెక్టర్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టామని, ఎవరైనా అందని వాళ్లుంటే ముందుకొచ్చి చెప్పాలని సీఎం పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలనే తాపత్రయంతో పనిచేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు, రూ. రెండు వేల సహాయం చేయాలని ఆదేశించామని తెలిపారు. కచ్చా ఇళ్లు, మామూలు ఇళ్లు దెబ్బతింటే రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఉదయం 7 గంటల నుంచే హెలిప్యాడ్ నుంచి కూనవరం వరకు రాకపోకలు నిలిపివేయడంతో భద్రాచలం నుంచి కూనవరం మీదుగా రాజమండ్రి, కాకినాడ వెళ్లే బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కూనవరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు రాకపోకలు సాగించే వీలులేక ఇంటిముఖం పట్టారు. సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన భారీ బందోబస్తుతో పలు గ్రామాల ప్రజలు సభా ప్రాంగణానికి రాలేకపోయారు. కూనవరం మండలంలోని కోండ్రాజుపేట వద్దే వాహనాలు, ప్రజలు నిలిపివేయడంతో చాలామంది సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. సభా ప్రాంగణానికి చేరుకోలేని కొందరు పోలవరం ప్యాకేజీపై సీఎం ఏం ప్రకటిస్తారా అని ఫోన్లలో చూసుకున్నారు.
జగన్ కూనవరం పర్యటనను పురస్కరించుకుని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బ్యారికేడ్లతో రహదారులు దిగ్బంధం చేశారు. ఆయన హెలికాప్టర్లో కోతులగుట్ట వద్ద దిగారు. అక్కడి నుంచి కూనవరం బస్టాండులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం సుమారు నాలుగు కిలోమీటర్లు. హెలిప్యాడ్ దగ్గర నుంచి సభా ప్రాంగణం వరకు బ్యారికేడ్లతో మూసేశారు. దీంతో టేకులబోరు గ్రామంలోని ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
పర్యటన కొంత ఆలస్యం
ముఖ్యమంత్రి పర్యటన కొంత ఆలస్యమైంది. కోతులగుట్టలోని హెలిప్యాడ్కు ఉదయం 10.25 గంటలకు రావాల్సి ఉండగా 10.55 గంటలకు చేరుకున్నారు. దీంతో అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్కు చేరుకున్న తరవాత స్థానిక నాయకులతో, అధికారులతో చాలాసేపు మాట్లాడారు. సాయంత్రం 3.55 గంటలకు కుక్కునూరు మండలానికి ప్రయాణమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
నిర్వహణ పనులపై నిర్లక్ష్యం
[ 17-05-2024]
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రంలో సివిల్ డివిజన్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జలాశయం రక్షణ కోసం చేపట్టాల్సిన మరమ్మతు పనులను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
[ 17-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
మాంచానమ్మ జాతర ప్రారంభం
[ 17-05-2024]
పెదార్కూరు ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. -
బీసీజీ టీకా తప్పనిసరి
[ 17-05-2024]
టీబీ బాధితుల కుటుంబసభ్యులు తప్పనిసరిగా బీసీజీ టీకా వేసుకోవాలని టీబీ రాష్ట్ర బృంద ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు (హెల్పర్) మృతి చెందాడు. -
పాడేరులో పాగా వేసేదెవరు?
[ 17-05-2024]
మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఈసారి ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు.. నువ్వా.. నేనా అంటూ సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అడవి బిడ్డల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది. -
ఫలించిన ప్రణాళిక
[ 17-05-2024]
మావోయిస్టు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలపై ఆంక్షలు
[ 17-05-2024]
రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పోలీసులు ఎన్నికల ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. -
క్షయ నివారణకు చర్యలు
[ 17-05-2024]
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
[ 17-05-2024]
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత గురువారం తనిఖీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి