logo

‘విశాఖ ఉత్తరం’ నుంచి పోటీ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని జై భారత్‌ పార్టీ అధ్యక్షులు, సీబీఐ పూర్వ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.

Updated : 15 Mar 2024 08:14 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని జై భారత్‌ పార్టీ అధ్యక్షులు, సీబీఐ పూర్వ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్‌ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని.. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో గ్రూపు-1ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. ఫ్రంట్‌ సమన్వయకర్త చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని